Friday 6 November 2020

శ్రీ విష్ణు బువా బ్రహ్మచారి...🙏🏻

మహాత్ముల పరిచయం-376
శ్రీ విష్ణు బువా బ్రహ్మచారి...🙏🏻
వీరు 1825 సంవత్సరంలో జన్మించారు. ఐదవ సంవత్సరంలో తండ్రి గారు చనిపోవడంతో తీవ్ర వైరాగ్యము వచ్చి కొన్ని రోజులు వేదం అధ్యయనం చేసి,9వ ఏడు వచ్చేసరికి చక్కగా రాయడం నేర్చుకున్నారు.9 ఏటనే వీరికి రెవిన్యూ శాఖలో రాసే ఉద్యోగo వచ్చింది. చిన్నప్పటి నుంచి వివేక సింధు,జ్ఞానేశ్వరి,వేదోక్త ధర్మ ప్రకాష్,భావార్త సింధు,దాసభోధ చదువుతూ తీవ్ర సాధన చేసేవారు.కానీ తల్లి గారు అడవిలో ఆవులు, వ్యవసాయం చేయమని చెప్పడంతో ఇంటి నుంచి పారిపోయి సప్తశృంగి కొండకి వెళ్లి,అక్కడ అడవిలో సద్గురువు కోసం కందములాలు తింటూ,తీవ్ర తపస్సు చేసాడు. దత్తాత్రేయ స్వామి సాక్షాత్కారం కలిగింది. స్వామి వీరిని నా స్వరూపంగా, జనాలకు ఆధ్యాత్మిక, సామాజిక స్ఫూర్తి అందరిలో జ్ఞానం తలఎత్తేలా కలిగించండి, ప్రపంచానికి భోధించండి అన్నారు.వీరు దత్తాత్రేయ స్వామి తో నా శక్తీకి మించిన పని కదా అన్నారు. స్వామి వీరితో మీరు శూన్య స్థితిలో ఉండి జ్ఞానంతో నా మాటలు వినండి చాలు అన్నారు. వీరు అనేక ఆధ్యాత్మిక గ్రంధాలు రచించి,ఊరు ఊరు తిరుగుతూ ప్రజలలో భక్తి,సామాజిక చైతన్యం కలిగించారు.
1.అప్పటి లోనే పునర్వివాహం,2.వివాహ వ్యవస్థ మీద అనాగరిక సతీ సహగమనం,కట్నం,అంటరానితనం లాంటి వాటి మీద,సత్వ గుణం మీద ప్రజల్లో, గిరిజనులలో,అందరిలో ఒక ఉత్తేజం తెచ్చారు. ప్రజలు అందరిదీ ఒకటే కుటుంబం, భగవంతుని దృష్టిలో అందరూ ఒకటే అనే వారు. బ్రిటిష్ వారి కుతంత్రాలను ముందుగానే తన యోగ శక్తితో ప్రజలకు హెచ్చరించి,ఆ బాధల నుంచి తప్పించేవారు 18-ఫిబ్రవరి-1871 సంవత్సరం లో సమాధి చెందారు.

No comments:

Post a Comment