Thursday 19 November 2020

గిరినార్-పగలే బాబా

 


గిరినార్-పగలే బాబా

గిరినార్ పరిక్రమ
Part-1
గిరినార్ పర్వతం అతి పురాతన పర్వతం,సౌరాష్ట్ర లో అతి ఎత్తైన పర్వతం. ఈ పర్వతం చుట్టూ 7 పర్వతాల సమూహం.గౌరక్ష నాధ్,అంబామాత, ఊగరనాధ్....ముందు అంబాశిఖర్, తరువాత గోరక్షనాధ్ శిఖర్,ఊగరనాధ్ శిఖర్,తరువాత గిరినార్ పర్వతం పై శ్రీ దత్తాత్రేయ స్వామి విరాజమానులై ఉంటారు.ఈ పర్వతాలలో అనేక గృహాలు ఉన్నాయి.ఈ గృహాలలో ఇప్పటికి నిరంతరం 84 మంది యోగులు,నవనాధులు,అశ్వధామ ఉన్నారని ప్రసిద్ధి.కలియుగం పూర్వం పర్వతాలకి రెక్కలు ఉండేవి ట. స్వేచ్ఛగా విహారుస్తూ,తరచు క్రిందకి దిగడం వల్ల ఇబ్బంది గా ఉందని ఇంద్రుడు వజ్రాయుధం తో పర్వతాల రెక్కలు కోసాడు. హిమాలయాల లో ఉండే ఈ పర్వతం ఇక్కడ ఎగురుతూ వచ్చి ఆగిపోయింది అంటారు.హిమాలయాల కన్నా పురాతన మైన పర్వతం గా చెప్తారు.సౌరాష్ట్ర లో ఎత్తైన పర్వతం.
ఇక్కడ బోధ్ గృహ లో 1200 సంవత్సరాల వయస్సు గల పగలా బాబా ఇప్పటికి వున్నారు.7 అడుగులు ఎత్తున, జుట్టు 10 అడుగులు,20 సంవత్సరాలు వయస్సు తో కనపడుతూ,చేతులు మోకాళ్లను దాటి బ్రహ్మ తేజస్సు తో ఉంటారు.నిరాహరి వారు.అక్కడ84 మంది సిద్ధులు 200 ఏళ్ళ నుoచి 900 సంవత్సరాలు మధ్య వయస్సు వారే.పగలే బాబా మార్గదర్శనం లో సాధన చేస్తుంటారు. తరచూ గిరినార్ పర్వతం లోపల అంతా ఖాళీగా ఉంటుంది. పైనుంచి స్థూపం ఆకారంలో నెల వరకు అంతా ఖాళీనే. పర్వతం లోపలికి 84 యోగులు,నవనాధులు,అశ్వధామ్, లు ప్రవేశిస్తారు.తరువాత దత్తాత్రేయ స్వామి ప్రకటం అయి వారితో సత్సంగం నిర్వహిస్తారు.
గిరినార్ పర్వతం పరిక్రమ కార్తీక శుక్ల ఏకాదశి రోజు మొదలు అయి,పౌర్ణమి రోజు సమాప్తి అవుతుంది. ఆ 5 రోజులు ఈ మహనీయులు పరిక్రమ చేసే వారిని ఆశీర్వదిస్తారు.అక్కడ జంతువులు ఎవరినీ ఏమి చేయవు.
జై గురు దత్త
ధర్మదాస్ బాబా ,గిరినార్.
తెలుగు:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.

No comments:

Post a Comment