Saturday 24 October 2020

సమశ్లోకి నుంచి....

 దత్త లీలా క్షేత్ర మహత్మ్యం....🙏🏻

సమశ్లోకి నుంచి......

శ్లో::- యద్గృహే2 సౌ కథారమ్యా శ్రావ్యతే పఠ్యతే సదా!

 నందతే శ్రీయుతం తస్య సుశీలం విమలం కులమ్ ॥

 శ్లో::-  శ్రీగరోఃకృపయా తత్ర రోగపీడాది నైవచ!

సప్తాహశ్రవణా త్సర్వ పాశ(ప)నాశోఽప్య సంశయం॥

భావం::- 🙏🏻

 ఏ గృహంలో దత్తాత్రేయుల వారి ప్రతిరూపమైన ఈ గురుచరిత్ర నిత్యం పారాయణ చేయబడుతూ ఉంటుందో, ఆ గృహంలో సిరిసంపదలు

కోకొల్లలుగా ఉంటాయి. ఆ ఇంట్లో ఉన్నవాళ్ళంతా ప్రశాంత మనస్కులై, సుచరిత్రులై సుఖసంతోషాలతో తులదూగుతుంటారు. దత్తాత్రేయావతారు లైన శ్రీనరసింహసరస్వతీస్వామి

వారి అనుగ్రహం వల్ల రోగాలు, బాధలూ, గ్రహ పీడలు దూరంగా పారిపోతాయి. ఈ గ్రంథాన్ని దీక్షతో సప్తాహ పారాయణం చేస్తే సర్వపాపాలు భస్మీపటలమౌతాయి. కనుక ఈ పవిత్ర గ్రంథాన్ని శ్రద్ధా భక్తితో పూజించి, పఠించి, అమృత స్వరూపులు కండి.

జై గురు దేవ దత్త.🙏🏻

No comments:

Post a Comment