Wednesday 26 December 2018

భోజనం ఏ పాత్రలలో వండుకుంటే ఉత్తమం?

భోజనం ఏ పాత్రలలో వండుకుంటే ఉత్తమం?
వాగ్భటాచార్యునిమొదటి సూత్రముఏ ఆహారమును వండేటప్పుడు గాలి,వెలుతురు తగులుతూ ఉండాలి.సూర్య రశ్మి,గాలి తగలని ఆహారము విషముతో సమానం. ఈ విషము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి తక్షణమే పని చేస్తుంది. దానినే ఫుడ్ పాయిజన్ అంటాము.
రెండవది కొన్ని నెలలకు,లేదా సంవత్సరాలకు ప్రభావం చూపుతుంది.ఉదా. ప్రెషర్ కుక్కర్ - ఇందులో ఆహారం వండేటప్పుడు ఏ మాత్రము గాలి, సూర్య రశ్మి తగిలే అవకాశమే లేదు. ఇది పూర్తిగా విషతుల్యం.
మరొక ప్రమాదమేమిటంటే ఇదితయారుచేసేది అల్యూమినియంతో. ఇది మరింత ప్రమాదకరము. దీని వాడకము బ్రిటీష్ వాళ్ళచే జైళ్లలో ఖైదీలుగా ఉన్న భారతీయ ఉద్యమకారులను నిర్వీర్యం చేయటానికి మనదేశములో ప్రవేశపెట్టారు అంటే ఎంత ప్రమాదకరమైన విష పాత్రలలో మనము తింటున్నామోగమనించగలరు.
ప్రెషర్' అంటే ఒత్తిడి. అంటే మనము 'ప్రెషర్ కుక్కర్' లో వండే పదార్థం ఒత్తిడికి గురై త్వరగా మెత్తబడుతుంది... కానీ ఉడకదు.పదార్ధం ఉడకటం వేరు, మెత్తబడటం వేరు.
ఉదా.కందిపప్పు పంట పండటానికి కనీసం 7 నుండి 8 నెలలు పడుతుంది. ఎందుకంటే అన్ని పోషకాలు మొక్క వేరులోకి చేరి క్రమంగా ఫలానికి చేరుతాయి.కనుకనేఅంత సమయం పడుతుంది. కాబట్టి గింజలోని అన్ని రకాల పోషకాలు మన శరీరం లోకి చేరాలంటేపదార్ధం వండబడాలి. మెత్తబడితే సరిపోదు.
భోజనం వండటానికి యోగ్యమైన పాత్రలు - వాటిలో వండితే ఉండే పోషక విలువల నిష్పత్తి
మట్టి కుండ - 100%
కంచు పాత్ర - 97%
ఇత్తడి పాత్ర - 93%
అదే అల్యూమినియం ప్రెషర్ కుక్కర్ లో వండితే కేవలం 7% - 13% ఉంటాయి.
వీటిలో వండిన ఆహారం తినటంవల్ల మధుమేహం, కీళ్ళవాతం, అకాల వృద్దాప్యం, ఉదర వ్యాధులు వంటి వస్తాయి… దేనికైనా తినే ఆహారమే కదా మూలం.
ఇలాంటివే రిఫ్రిజిరేటర్, మైక్రో వేవ్ ఓవెన్ వంటి గాలి,వెలుతురు ప్రవేశించని వస్తువులు ఏవైనా ప్రమాదకరము.సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్ స్టి ట్యూట్(CTRI) వారి నివేదిక ప్రకారం కూడా ఇదే విషయం నిర్దారితమైనది...
.
.

No comments:

Post a Comment