Saturday 10 August 2019

చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి (ఆగష్టు 8, 1870 - 1950) :

#చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి (ఆగష్టు 8, 1870 - 1950) :
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
తెలుగు కవి, అవధాని, నాటకకర్త. తెలుగులో అవధాన విద్యకు రూపురేఖలు తీర్చిదిద్ది, వన్నెవాసి సమకూర్చిన తిరుపతి వేంకట కవులలో ఒకడు. దివాకర్ల తిరుపతిశాస్త్రితో జంటగానూ, అతని మరణానంతరం విడిగానూ ఎన్నో పద్యనాటకాలు, కావ్యాలు, వచన రచనలు రచించాడు.
ప్రజల్లో భక్తి,సదాచారం,సత్ప్రవర్తన,ధర్మాచరణం వంటి సుగుణాలను పెంపొందించి తన పాండిత్యం ద్వారా అక్షరసిరులను పండించిన అత్యుత్తమ తెలుగు కవి వర్యుడు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారు.
నేడు ఆయన 150 వ జయంతి ఉత్సవం!!!
సమకాలీన తెలుగు రచయితలు వారినుంచి నేర్చుకోవలసిన విషయాలు అనేకం ఉన్నాయ్!!!!

No comments:

Post a Comment