Thursday 14 November 2019

నెహ్రూ నీచత్వానికి పరాకాష్ట....!😢 **************************

నెహ్రూ నీచత్వానికి పరాకాష్ట....!😢
**************************
పటేల్ మరణించిన గంటకు అప్పటి ప్రధాని నెహ్రూ మరణంతో బాటుగా ఇలా ప్రకటించాడు -
1. పటేల్ కిచ్చిన ప్రభుత్వ కారుని వెంటనే వెనక్కు తీసుకురండి.
2. కేంద్రహోంశాఖ కార్యదర్శులు గానీ , ఇతర అధికారులు గానీ బొంబాయి వెళ్ళదలచుకుంటే వారివారి సొంత ఖర్చులపై వెళ్ళవలసి ఉంటుంది..
అయితే , హోంశాఖ కార్యదర్శి VP Menon మాత్రం నెహ్రూ ఇచ్చిన ఉత్తరాన్ని , తాను ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో బహిర్గతం చేయలేదు. పైగా అధికారులను తన ఖర్చుపై బొంబాయి పంపించాడు..
తరువాత నెహ్రూ అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ కి పటేల్ అంతిమసంస్కారం లో పాలు పంచుకోరాదనే కాబినెట్ సిఫార్సుని పంపాడు. కానీ, రాష్ట్రపతిగా ఉన్న రాజేంద్రప్రసాద్ నెహ్రూ ఇచ్చిన ఉచిత సలహాని పక్కనపెట్టి అంత్యక్రియలకు హాజరవ్వడానికే నిర్ణయం తీసుకున్నారు. అది తెలిసిన నెహ్రూ ప్రభుత్వం తరపున రాజగోపాలాచారి ని పంపించి, ప్రభుత్వ స్మారక పత్రాన్ని రాష్ట్రపతికి ఈయకుండా రాజగోపాలాచారిచే చదివించాడు..
అనంతరం పటేల్ కి ఒక స్మారకాన్ని నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ తీర్మానించింది. ముందు నెహ్రూ విరోధించాడు , తరువాత సరేనని హామీ ఇచ్చాడు. తరువాత పటేల్ ఒక రైతు నాయకుడనీ , కాబట్టి గ్రామగ్రామాల ఆయన పేర నూతులు తవ్వించాలనీ నెహ్రూ తన పార్టీవారిని నమ్మించాడు. ఆ నూతి తవ్వకాలు ఎప్పుడు ప్రారంభమైనాయో, ఎప్పుడు ముగిసాయో నెహ్రూ కే తెలియాలి. ఆవిధంగా పటేల్‌కం స్మారకం లేకుండా కుట్ర చేసి ఆపించాడు నెహ్రౄ..
అనంతరం, మునుపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో తనకు పోటీగా పటేల్ పేరుని ప్రతిపాదించిన #పురుషోత్తమదాస్ టండన్ ను పార్టీనుండి బహిష్కరించాడు. అంతేకాకుండా ఆ సమావేశంలో తనకు వ్యతిరేకంగా ఓటు వేసిన మిగతా 13 మందికి పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చేశాడు. ఎవరైనా పటేల్ గురించి మాట్లాడితే బిగ్గరగా Get out from here అని అరిచేవాడు..
పటేల్ మరణానంతరం నెహ్రౄ #కమ్యూనిష్టులకు బాగా దగ్గరై వారి విధానాలను అమలు చేయడం ప్రారంభించాడు. చరిత్ర రచనకు శ్రీకారం చుట్టి #స్వాతంత్ర్యం తన వల్ల గాంధీ వల్లనే సిధ్దించినట్లుగా చరిత్రను రాయించాడు. స్వాతంత్ర్యం కోసం అశువులు బాసిన 3 లక్షల మంది పేర్లు ఎక్కడా చరిత్రలో మిగలకుండా జాగ్రత్త పడ్డాడు..
ఇవన్నీ ఎందుకు గుర్తుచేసుకోవడమంటే, కాంగ్రెస్ వారు ఇప్పుడు పటేల్ నామజపం చేస్తున్నారు కనుక.
మన హిందూ సంస్కృతిని , ఆచారాలను నాశనం చేయుటకు కంకణం కట్టుకున్న కాంగ్రెస్ వాళ్ళు 70 ఏళ్ళుగా గుట్టుచప్పుడు కాకుండా, చాపకిందనీరులా తమ రహస్య ఎజెండాను అమలుజరుపుతూనే ఉన్నారు....

No comments:

Post a Comment