Thursday 12 September 2019

ప్రముఖ వాగ్గేయ కారులు

సంగీత దీపిక
●●●●●●●●●
ప్రముఖ వాగ్గేయ కారులు
(అతి సంక్షిప్త పరిచయం)
■★■★■★■★■★■★■★■
*********************** జయదేవుడు(1101-1153)
***********************
'గీతగోవిందము' అను సంగీత గ్రంథమును సంస్కృత భాషలో రచించిన
ప్రథమవాగ్గేయకారుడు.'జయదేవ'
ముద్రతో ఇతను రచించిన సంగీత కృతులు 'అష్టపదులు'గా ప్రసిద్ధి చెందినవి
**************************
*పురందరదాసు(1484-1564)
**************************
తన ఇష్టదైవమగు పండరీపుర విఠలునిపై
వేలాది,సంగీత కృతులను కన్నడ భాషలో రచించారు.'దేవరనామాలు' అను పేరుతో
ప్రఖ్యాతిగాంచిన ఈతని కృతులు
'పురందరవిఠల' ముద్రతో ఉన్నాయి.
****************************
*అన్నమాచార్యులు(1408-1503)
****************************
తన ఇష్టదైవమైన తిరుపతి,
శ్రీవేంకటేశ్వరునిపై 32 వేల కీర్తనలను రచించినారు.ఈకీర్తనలు 'వేంకటేశ' ముద్రతో సాగుతుంది.
'ఆంధ్ర పద కవితా పితామహుడు' గా
ప్రఖ్యాతి చెందినారు.
*************************
*భక్త రామదాసు(1620-1680)
************************
*ఇతని అసలు పేరు కంచర్ల గోపన్న.తన
ఆరాధ్య దైవమగు శ్రీరామునిపై 'రామదాసు' ముద్రతో అనేక కీర్తనలను
రచించారు.
************************
*క్షేత్రయ్య (1610-1685)
************************
*ఇతని అసలు పేరు వరదయ్య. అనేక
క్షేత్రములను సందర్శించడం వలన క్షేత్రయ్యగా పిలువబడినారు.తన ఇష్ట
దైవమగు గోపాలస్వామి పేర 'మువ్వగోపాల' ముద్రతో పెక్కు సంగీత కృతులు రచించారు.
************************
శ్యామశాస్త్రి(1762-1827)
************************
అసలు పేరు వేంకట సుబ్రహ్మణ్యం. ఆంధ్రులైన సంగీతత్రయంలో మూడవ
వాడు. త్యాగరాజు,ముత్తుస్వామి దీక్షితులకు సమకాలికుడు.'శ్యామకృష్ణ'
ముద్రతో సంగీత కృతులు రచించారు.
***********************
*త్యాగరాజు(1767-1847)
***********************
కాకర్ల త్యాగరాజు 'సంగీతరత్నత్రయము'
గా,ప్రసిద్ధి గాంచిన వారిలో అగ్రగణ్యుడు.
తనఇష్టదైవమైనశ్రీరామునిపై,అపారమైన
భక్తితో 24 వేల కీర్తనలను రాసారు.
**********************
*ముత్తుస్వామి దీక్షితులు(1776-1835)
*********************
'సంగీతరత్నత్రయం'లో రెండవ వారు.
'గురుగుహ' ముద్రతో సంస్కృత భాషలో
వీరు కృతులు రచించారు.
**********************
*స్వాతితిరునాళ్(1813-1846)
**********************
తిరువాన్కూరు(కేరళ) సంస్థానమునకు
ప్రభువు.బహుభాషాపాండిత్యమునకు
తోడు,సంగీతంములోనూ ,విశేష ప్రజ్ఞా వంతులు. మళయాళము,తమిళము, సంస్కృతము,హిందీ, మరాఠీ, ఒరియా,కన్నడము ,తెలుగు వంటి
ఎనిమిది భాషలలో 'పద్మనాభ' ముద్రతో సంగీత కృతులను రచించారు.
************************
నారాయణ తీర్థులు(17వ శతాబ్దము)
************************
ఇతని అసలు పేరు తల్లావఝల శివశంకరశాస్త్రి. తన ఆరాధ్య దైవమగు
శ్రీకృష్ణుని లీలావినోదములను 'కృష్ణ లీలా తరంగిణి' అను సంగీత గ్రంథమున
విపులంగా వర్ణిస్తూ కీర్తనలను రాసారు.
ఇవి 'తరంగములు'అను పేర ప్రసిద్ధి చెందినవి.

No comments:

Post a Comment