Friday 28 September 2018

నిజం??? సామాజికం

Rama Subba Rao Bhuthamapuram
నిజం??? సామాజికం
***************************
నిజాలు నిప్పులై ఎగిసి పడ్డాయేమో!!
ఆ ప్రనయ్ ప్రణయ గాధలకు
మెల్లమెల్లగా తెరపడుతోంది!! 

అందుకే కాబోలు
కల్తీ మాటలు
కల్లబొల్లి కవితలు అల్లే వారు తోక ముడుస్తున్నారు!!
బుధ్ధి ఉండనవసరం లేదా??
లేకుంటే 13 ఏళ్ళ వయసుకే
ప్రేమలూ-పెళ్ళిల్లు అంత అవసరమా???
ఇదేనా జీవితమంటే!!!!!!
అప్పుడేదే ఓ సినీ కవి అన్న మాటలు
ఇపుడు గుర్తుకొస్తున్నాయ్!!
"నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని"

ఇవేనా తీర్పులంటే???



#తీర్పు--- ఇవేనా తీర్పులంటే???
********************************
మొన్న మగవారు మగవారు భేషుగ్గా కలుసుకొని 
కాపురం చెయ్యవచ్చని తీర్పు ఇచ్చారు!
నిన్న నేరస్తులు ఎన్నికల్లో పోటీచెయ్యవచ్చని సెలవిచ్చారు!!
నేడు మరో దారుణమైన తీర్పు - 
వివాహేతర సంబంధం నేరం కాదట!!! 
ఇవి న్యాయ స్థానాలా???
వీటిని మనిషి అన్నవాడు సమర్థిస్తాడా???
ధర్మాన్ని, నీతిని వెక్కిరించేవాడు, 
తప్పుడు తీర్పులిచ్చేవారు 
అశుధ్ధములో పురుగులై పుడుతారు!!!!!

WISDOM

WISDOM
"Even strength must bow to wisdom sometimes"
~ Sri Rama Samartha ~

తెలుగు భాష వయస్సెంత?

తెలుగు భాష వయస్సెంత?
వ్యాసాలు
రచన: సురేష్ కొలిచాల
************************
భాషను స్త్రీతో పోలుస్తారు. కానీ ఆడవాళ్ళ వయస్సు మొగవాడి జీతం అడగకూడదంటారు. ఆ రకంగా ఇది అడగకూడని ప్రశ్నే. అంతేకాక ఒక భాష ఎప్పుడు పుట్టింది అన్నది చాలా అసంబద్ధమైన (absurd) ప్రశ్న అని కొంతమంది భాషావేత్తలు అంటారు. “ప్రవాహినీ భాషా” అన్నట్లు భాష చరిత్రగతిలో మార్పులు చెందుతూ కొత్త కొత్త రూపాలు సంతరించుకొంటుందనీ, ఏ మార్పు ఎప్పుడు వచ్చింది అని అడగటం మాత్రమే సబబైన ప్రశ్న అని వారి వాదన. ఇటువంటి పరిశుద్ధ(Purist) వాదాన్ని పక్కనబెడితే, తెలుగు ఒక ప్రత్యేక భాషగా ఒక నియతస్థితిని, స్వయంప్రతిపత్తిని ఎప్పుడు ఏర్పరుచుకుందో ఆ కాలనిర్ణయం గురించి ప్రస్తుత భాషా పరిశోధకుల ఊహాగానాలను చర్చించడం ఈ వ్యాసం ముఖ్యోద్దేశ్యం.
భారతదేశంలోని భాషల చరిత్ర, భారతదేశపు పూర్వ చరిత్ర చాలా కాలంగా వివాదస్పదమైన అంశంగా మారింది. ఈ అంశంపై వచ్చిన వాదప్రతివాదాలు రాజకీయ, సాంఘిక ఉద్యమాలకు, భాషోన్మాదాలకు దారి తీసాయి. తమిళనాడులో ప్రారంభమైన ద్రావిడ ఉద్యమం ఇందుకు ఒక ఉదాహరణ. కాని ఆర్య, ద్రావిడ పదాలు భాషా కుటుంబాలని సూచించే పదాలే గాని, రెండు వేర్వేరు జాతులని సూచించే పదాలు కావని శాస్త్రవేత్తల నమ్మకం. జన్యుశాస్త్రంలో సాధించిన అభివృద్ధి ఆధారంగా ఈ దశాబ్దంలో జరుపుతున్న పరిశోధనలు భారతదేశంలో ఆర్య, ద్రావిడ అని రెండు విభిన్నమైన జాతులు లేవన్న శాస్త్రజ్ఞుల అభిప్రాయాలని ధ్రువపరుస్తున్నవి [4, 6].
ఇంతటి వివాదస్పదమైన అంశం గురించి రాయటానికి నాకే భాషాశాస్త్రంలో గానీ జన్యుశాస్త్రంలో గానీ పట్టభద్రత లేదు. నేను చదువుకున్న చదువుకు చేసే ప్రోగ్రామింగ్‌ పనికి, భాషా చరిత్రతో ఎటువంటి సంబంధం లేదు. నాకున్న అర్హతల్లా ప్రఖ్యాతి గాంచిన భాషావేత్తలైన భద్రిరాజు, ఎమెనో, స్జోబెర్గ్‌ తదితరులు రాసిన కొన్ని పుస్తకాలు, పేపర్లు గత పదేండ్లుగా చదవటం మాత్రమే.
కానీ తెలుగు భాష పుట్టుపూర్వోత్తరాల గురించిన కనీస వివరాలు చాలామంది తెలుగువాళ్ళకే తెలిసినట్టులేదు. ఈ మధ్య ఇండియాలో ఒక టీవీ ప్రోగ్రాంలో ఎక్కువమంది మాట్లాడే ద్రావిడ భాష ఏది అన్న ప్రశ్నకు సమాధానం “తెలుగు” అంటే మా అన్నయ్య ఆఫీసులో చాలా మంది ఒప్పుకోలేదట. తెలుగు ద్రావిడ భాషే కాదని వారి వాదన. ఇంతే కాక ఈ మధ్య భారతదేశ చరిత్ర గురించి, భారతీయ భాషల గురించి వింత వాదనలు, శాస్త్రవిమర్శకు నిలువలేని సిద్ధాంతాల ప్రచారాలు ఇంటెర్నెట్‌లోనూ బయటా జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రచారాల నేపథ్యంలో తెలుగుభాష గురించి చాలామంది భాషావేత్తలు ఒప్పుకునే వివరాలను నాకు తెలియవచ్చినంత తేటపరచాలని ఈ వ్యాసరచనా సాహసానికి పూనుకున్నాను.
తెలుగు సంస్కృత భవం కాదు
పూర్వకాలం నుండి తెలుగు సంస్కృత జన్యం అన్న అభిప్రాయం ఉందని చాలామంది నమ్మకం. ఇందుకు ఉదాహరణగా “తల్లి సంస్కృతంబు యెల్ల భాషలకు” అన్న కేతన పద్యాన్ని, “జనని సంస్కృతంబు సర్వభాషలకు” అన్న క్రీడాభిరామ పద్యాన్ని చూపిస్తారు. కానీ నిశితంగా చూస్తే నన్నయ్య కాలం నుండి కూడా తెలుగు సంస్కృత భాషల మధ్య అంతరం కవులకు స్పష్టంగా తెలుసునని మనకు తెలుస్తుంది. సంస్కృత ఛందస్సు వేరు, దేశి ఛందస్సు వేరు. సంస్కృత పదాలు వేరు (తత్సమాలు, తద్భవాలు), అచ్చతెలుగు పదాలు వేరు (దేశ్యాలు, గ్రామ్యాలు). తెలుగు సంధులు వేరు, సంస్కృత సంధులు వేరు. తెలుగు పదాన్ని, సంస్కృత పదాన్ని కలిపి రాయకూడదు. రాస్తే దుష్టసమాసం అవుతుంది. దేశి కవిత, మార్గ కవిత అని కవిత్వంలో రెండు భిన్న ధోరణులు ఉండేవని కూడా మనకు తెలుసు. చాలామంది కవులు ఈ రెండు ధోరణులకు మధ్యస్థంగా ఇరు పక్షాలు మెచ్చే రీతిలో కవిత్వం రాస్తున్నామని కూడా చెప్పుకున్నారు (ఉదా: శ్రీనాథుడు, పోతన, కొరవి గోపరాజు, మొల్ల).
పూర్వ కవుల అభిప్రాయం ఏమైనప్పటికీ 19వ శతాబ్దం వచ్చేసరికి తెలుగు సంస్కృత భవమే అన్న నమ్మకం చాలా బలంగా ఉండేది. ఈ నమ్మకాలకు ప్రతికూలంగా తెలుగుకు సంస్కృత ప్రాకృతాలతో జన్య జనక సంబంధం లేదని మొదటిసారి చెప్పిన ఘనత Francis White Ellis (1816) కు దక్కుతుంది. తరువాత ఎల్లిస్‌ పరిశోధనను కొనసాగించిన అలగ్జాండర్‌ క్యాంప్‌బెల్‌ ఇలా అన్నారు:
“It has been generally asserted, and indeed believed, that the Teloogoo has its origin in the language of the vedams … My inquiries have led to opposite conclusion … Teloogoo abounds with Sanskrit words … nevertheless, there is reason to believe that the origin of the two languages is altogether different”
ఎలిస్‌, క్యాంప్‌బెల్ సంగ్రహంగా ప్రతిపాదించిన ఈ సిద్ధాంతానికి సమగ్రాధారాలతో కూలంకష చర్చతో స్థిరత్వాన్ని కల్పించింది బిషప్‌ రాబర్ట్‌ కాల్డ్‌వెల్‌. ఈయన తమిళ, కన్నడ, తెలుగు భాషలతో సహా 12 భాషలు ఒకే భాషా కుటుంబానికి చెందినవని, వాటికి సంస్కృతంతో జన్మ సంబంధం లేదని సశాస్త్రీయంగా నిరూపించాడు. ద్రావిడ భాషా పరిశోధనా పితామహుడిగా ప్రసిద్ధి కెక్కిన కాల్డ్‌వెల్‌ 1856లో రాసిన గ్రంథం “A Comparative grammar of Dravidian Languages” తొలి ద్రావిడ భాషా శాస్త్రజ్ఞుల పాలిటి ప్రమాణ గ్రంథం. తరువాత గత శతాబ్దంలో ఆధునిక శాస్త్ర పద్ధతులలో ద్రావిడభాషా పరిశోధనను జరిపి దానికి శాస్త్రీయతను కూర్చి స్థిరమైన పునాది ఏర్పరచిన వారిలో ముఖ్యులు: ఎం. బి. ఎమెనో, టి. బరో, భద్రిరాజు కృష్ణమూర్తి గార్లు. 2003లో భద్రిరాజు కృష్ణమూర్తి గారు రాసిన “Dravidian Languages” పుస్తకం, గత రెండు శతాబ్దాల్లో ద్రావిడ భాషాధ్యయనంలో సాధించిన అభివృద్ధిని సాధికారకంగా చర్చించి నేటి ప్రమాణ గ్రంథంగా నిలిచిందని చెప్పవచ్చు.
తెలుగు తమిళం నుండి పుట్టలేదు
తెలుగు సంస్కృతం నుండి పుట్టలేదు అంటే ఇది తమిళం నుండో కన్నడ నుండో పుట్టి ఉండాలి అన్న వాదం విన్నాను. తమిళం లో క్రీస్తు పూర్వము 3వ శతాబ్ది నుండి ప్రాచీన సాహిత్యం దొరుకుతుంది. కన్నడం లో ప్రాచీన గ్రంథం “కవిరాజ మార్గ” క్రీస్తు శకం 9వ శతాబ్దంలో రాయబడ్డది. కాబట్టి తెలుగు కన్నడ నుండో తమిళం నుండో పుట్టివుండాలని వీరి తర్కం. తమిళం ప్రాచీన భాషే ఐనా తమిళమే ప్రాచీన లక్షణాలను నిలుపుకొంది అనటం సరి కాదని, కొన్ని విషయాలలో తెలుగు మొదలైన ఇతర భాషలలోనే తమిళంలో లేని ప్రాచీన లక్షణాలు ఉన్నాయని భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం. 1906 లో Linguistic Survey of India లో ద్రావిడ భాషల పరస్పర సాన్నిహిత్యాన్ని గురించి రాస్తూ స్టెన్‌కొనో ఇలా అన్నారు
“Tamil has usually been considered to be the Dravidian language which has preserved most traces of the original form of speech from which all other Dravidian dialects are derived. Some points will be drawn attention to in the ensuing pages where this does not appear to be the case, and in many peculiarities other Dravidian languages such as Telugu have preserved older forms and represent a more ancient state of development. It would therefore be more correct to describe Tamil as a dialect like the other ones, without any special claim to antiquity.”
ఆ రకంగా తమిళ కన్నడ భాషలు తెలుగుకు సోదర భాషలే కాని మాతృకలు కావు. క్రీస్తు పూర్వం నాలుగు, ఐదువేల యేండ్లకు పూర్వం మూల ద్రావిడ భాష ఒకే భాషగా ఉండేదని, అది కాలక్రమాన ఇప్పటి ద్రావిడ భాషలుగా విడిపోయిందని భాషా శాస్త్రజ్ఞులు తులనాత్మక పద్ధతి ద్వారా నిర్ణయించారు.
ద్రావిడ భాషగా పుట్టి సంస్కృత పోషణలో పెరిగిన తెలుగు
తెలుగు ద్రావిడ భాష కాబట్టి సంస్కృత భాషా పదాలు వాడటం మానేసి అచ్చ తెలుగు పదాలే వాడాలని “వార్త” పత్రికలో ఒక వ్యాసం చదివాను. ఈ రకమైన వాదం తెలుగును రెండు మూడు వేల యేండ్లు వెనక్కి తీసుకువెళ్ళాలన్న ప్రయత్నమే. తెలుగు పుట్టినప్పటి నుండి వేలకొద్దీ సంస్కృత, ప్రాకృత పదాలు తెలుగులో వచ్చి చేరాయి. పద నిర్మాణంలోను, వాక్య నిర్మాణం లోనూ తెలుగు ఎన్నో సంస్కృత లక్షణాలను తనలో కలుపుకొంది. తెలుగు కవులందరూ సంస్కృత భాషను క్షుణ్ణంగా అభ్యసించిన వారే కాబట్టి ఆ భాషా ప్రభావం తెలుగు సాహిత్యం పై స్పష్టంగా కనిపిస్తుంది. ద్రావిడ భాషలో లేని Passive Voice (బడు ప్రయోగం), Relative Pronouns తెలుగులో వచ్చి చేరటం సంస్కృత ప్రభావాన్నే చూపిస్తుంది. పోతన రాసిన “ఎవ్వనిచే జనించు జగము … వానిన్‌ … శరణంబు వేడెదన్‌” అన్న పద్యము సంస్కృతంలో ఆలోచించి తెలుగులో రాసిన పద్యమని కూడా చెప్పవచ్చు.
ద్రావిడ భాషల వర్గీకరణ
రాబర్ట్‌ కాల్డ్‌వెల్‌ రాసిన Comparative Dravidian Grammar గ్రంథంలోనే తమిళ, మలయాళ, కన్నడ భాషలకు దగ్గరి సంబంధం ఉందని, తెలుగు తమిళ భాషలకు మధ్య చాలా వ్యత్యాసం ఉందనీ సూచించారు. 1906లో స్టెన్‌కొనో ద్రావిడ భాషలని తమిళ సముదాయం, తెలుగు సముదాయం అని రెండుగా విభజించారు. మూల ద్రావిడ భాష మొదట మూడు ఉపకుటుంబాలు గా చీలిందని ఇప్పుడు పండితులంతా అంగీకరిస్తున్నారు. 1975లో భద్రిరాజు కృష్ణమూర్తి గారు, తెలుగు-కువి-గోండీ భాషలను దక్షిణ-మధ్య ద్రావిడ భాషలుగా మూల దక్షిణ ద్రావిడం నుండి విడివడిన మరో ఉపశాఖకు చెందిందన్న కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ మధ్య ఆయన ద్రావిడ భాషలపై ప్రచురించిన గ్రంథరాజంలో తెలుగు దక్షిణ మధ్య ద్రావిడ ఉప కుటుంబానికి చెందిందని సాక్ష్యాధారాలతో నిరూపించారు. ఈ పుస్తకంలో 26 ద్రావిడ భాషలను ఇలా విభజించారు:
తెలుగు భాష ఎప్పుడు పుట్టింది?
మొట్టమొదటి తెలుగు శాసనాలు
తెలుగు మాట కనిపించే మొట్ట మొదటి శాసనం క్రీస్తు శకం 200కి చెందినది. బ్రహ్మీ లిపిలో ఉన్న ఈ శాసనం గుంటూరు‌ జిల్లా అమరావతిలో దొరికింది. అంతకు పూర్వం అశోకుడు, బౌద్ధ మత ప్రచారానికి తన దూతలను ఆంధ్రదేశానికి పంపినట్లు అశోకుడి కాలం నాటి శాసనాల ద్వారా తెలుస్తోంది. పూర్తిగా తెలుగు భాషలో రాసిన శాసనాలు మనకు క్రీస్తు శకం ఆరవ శతాబ్దినుండి దొరుకుతున్నాయి. వీటిలో కడప జిల్లా ఎర్రగుడిపాడు (క్రీశ 575-600), కలమళ్ళ (క్రీశ 576-600) లో దొరికిన శాసనాలు మొట్ట మొదటివి. ఆరో శతాబ్దికి ముందు ఆంధ్ర ప్రాంతంలో శాసనాలు సంస్కృత ప్రాకృత భాషలలో వేసేవారు కానీ వాటిలో ఉన్న ఊళ్ళ పేర్లు, మనుష్యుల పేర్లు తెలుగువే. ఈ శాసనాలలో ఉన్న ఏళూరు, తాన్ఱికొన్ఱ (తాటికొండ) మొదలైన ఊళ్ళ పేర్లు ఆ రోజులలో సామాన్య ప్రజలు తెలుగే మాట్లాడే వారని నిరూపిస్తుంది.
ప్రాచీన కావ్యాలలో ఆంధ్ర/తెలుగు ప్రస్తావన
రామాయణంలో సుగ్రీవుడు సీతాదేవి ఉనికిని గూర్చి వెతుకవలసిన స్థలాలను పేర్కొనే సందర్భంలో వరుసగా దండకారణ్యం, గోదావరీ నది, తరువాత, ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య దేశాలున్నట్టు చెప్పాడు. ధర్మరాజు రాజసూయం చేసే ముందు దక్షిణ దిగ్విజయ యాత్రకు సహదేవుని పంపినట్లు అతడు పాండ్యులు, ద్రవిడులతో పాటు ఆంధ్రులను, కళింగులను, ఓఢ్రులను జయించినట్లు భారతంలో ఉంది. బౌద్ధ సారస్వతంలో చోళరఠ్ఠం, కళింగరఠ్ఠం, ద్రమిళరఠ్ఠం తో పాటు గోదావరినదికి ఇరు వైపుల అళక, ముళక దేశాలున్నట్లు, ఇవి రెండు అంధక రాష్ట్రాలని “సుత్తనిపాత” గ్రంథంలో ఉంది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో మన దేశానికి వచ్చిన గ్రీక్‌ రాయబారి మెగస్తనీస్‌ మౌర్యుల తరువాత ఎన్నదగిన జాతి ఆంధ్ర జాతియని, వారి రాజు మిక్కిలి బలవంతుడని అతనికి 32కోటలున్నాయని పేర్కొన్నాడు.
ఆంధ్ర జాతి ప్రస్తావన మొట్టమొదటి సారి క్రీస్తు పూర్వం 7వ శతాబ్దానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో కనబడుతుంది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దికి చెందిన భరతుని నాట్యశాస్త్రంలో కూడా ఆంధ్ర భాషా ప్రస్తావన మనకు కనిపిస్తుంది. నాటకాలలో సంస్కృత ప్రాకృతాలే కాక సామాన్య ప్రజలు మాట్లాడే భాషలను వాడవచ్చని చెబుతూ, శకార, ఆభీర, చండాల, శబర, ద్రమిళ, ఆంధ్ర జాతుల భాషలను కూడా వాడవచ్చని ఇందులో ఉంది. ఐతే ఆంధ్ర రాజులు, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర జాతి అన్న పదాలలో ఆంధ్ర శబ్దం తెలుగుకు పర్యాయపదంగా తీసుకుంటే క్రీస్తు పూర్వం 7వ శతాబ్దికి ముందుగానే ఆంధ్ర/తెలుగు ప్రత్యేక జాతిగా గుర్తింపబడిందని చెప్పవచ్చు.
భాషా శాస్త్ర పరంగా తెలుగు కాలనిర్ణయం
తమిళంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండీ సాహిత్యం లభిస్తోంది. తమిళం లోనూ కన్నడలోనూ తాలవ్యీకరణ (palatalization) లో వ్యత్యాసం కనబడుతోంది కాబట్టి, అవి రెండు కనీసం మూడు నాలుగు వందల యేండ్ల ముందుగా విడివడి ఉండాలి. ఆ రకంగా పూర్వ-తమిళం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో ప్రత్యేక భాషగా ఏర్పడి ఉండవచ్చు. కానీ దక్షిణ ద్రావిడ భాషలకూ, దక్షిణ-మధ్య ద్రావిడ భాషలకూ శబ్ద నిర్మాణంలోనూ, వాక్య నిర్మాణంలోనూ అనేక వ్యత్యాసాలు కనిపిస్తాయి. దక్షిణ ద్రావిడ భాషలైన తమిళ‌-కన్నడ లతో పోలిస్తే తెలుగు-కువి-గోండీ లలో కనిపించే వ్యత్యాసాలో కొన్ని[1,3,5]:
వర్ణవ్యత్యయం (metathesis): తెలుగు-కువి-గోండి భాషలలో మూల ద్రావిడ ధాతువులోని అచ్చు తరువాతి హల్లు పరస్పరం స్థానం మార్చుకుంటాయి. (ఉదా: వాడు < *అవన్ఱు, వీడు <*ఇవన్ఱు, రోలు < ఒరళ్ <*ఉరళ్)
తెలుగులో బహువచన ప్రత్యయం- లు. తమిళాది దక్షిణ భాషల్లో ఇది -కళ్‌, -గళు.
క్త్వార్థక క్రియలు తమిళాదుల్లో -తు -ఇ చేరటం వల్ల ఏర్పడుతాయి. తెలుగు-కువి-గోండి భాషలలో -చి, -సి చేరటం వల్ల ఏర్పడుతాయి. ఉదా: వచ్చి, చేసి, తెచ్చి, నిలిచి వరుసగా తమిళంలో వన్దు , కెయ్దు, తన్దు, నిన్ఱు.
పైన పేర్కొన్న లక్షణాలన్నీ దక్షిణ మధ్య ద్రావిడ భాషలన్నిటిలో ఉండి దక్షిణ ద్రావిడ భాషలో లేనివి. అంటే ఈ మార్పులన్నీ తెలుగు-కువి-గోండి ఒకే భాషగా కలిసి ఉన్న రోజులలో మూల దక్షిణ ద్రావిడ భాషనుండి విడిపోయిన తరువాత వచ్చిన మార్పులన్న మాట. అన్ని ముఖ్యమైన మార్పులు రావటానికి కనీసం 400-500 సంవత్సరాలు పట్టవచ్చు. అంటే తెలుగు-కువి-గోండి భాషలు దక్షిణ మధ్య ద్రావిడ ఉప శాఖగా క్రీస్తు పూర్వం 1100 సంవత్సరంలో మూల దక్షిణ ద్రావిడం నుండి విడిపోవచ్చు. ఇదే నిజమైతే క్రీస్తు పూర్వం 700-600 వరకే తెలుగు ఒక ప్రత్యేక భాషగా స్వయంప్రతిపత్తిని కలిగి ఉండవచ్చునని మనం ఊహించవచ్చు[1]. క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణం ఆంధ్ర జాతిని ప్రత్యేక జాతిగా పేర్కొనడం ఈ లెక్కతో సరిపోతుంది కూడా!
ఈ రకమైన కాలనిర్ణయం సాపేక్ష కాలమానాల (relative chronology) మీద ఆధారపడ్డదే కానీ పద, ధాతు వ్యాప్తి గణాంకాల (lexicostatistics) మీద ఆధారపడ్డది కాదు. ద్రావిడ భాషల పూర్వచరిత్ర పై ఇంకా పరిశోధనలు ఇతోధికంగా జరిగితే గాని తెలుగు భాషా జనన కాలనిర్ణయాన్ని నిష్కర్షగా చెప్పలేం.
~ దన్యవాదాలు సురేష్ కొలిచాల, తెలుగు లిటరేచర్ మరియు Subba Rao Msv గారికి ~

Sunday 23 September 2018

KV REDDY

KV REDDY
వెండితెర దీపిక
★★★★★★★
సుప్రసిద్ధ సినీ దర్శకుడు
కె.వి.రెడ్డి
(కదిరి వెంకటరెడ్డి)
1-7-1912 15-9- 1972
●●●●●●●●●●●●●●●●●●
కె.వి.రెడ్డి గా సుప్రసిద్ధులైన కదిరి వెంకట రెడ్డి గారు
తెలుగు సినిమాలకు స్వర్ణ యుగమైన, 1940-1970 మధ్య కాలంలో ఎన్నో ఉత్తమ చిత్రాలను తెలుగు తెరకు అందించిన ప్రతిభావంతుడైన దర్శకుడు, నిర్మాత మరియు రచయిత.
పురాణాలు, జానపద చలన చిత్రాలు తియ్యడంలో సాటి లేని మేటి అనిపించుకొన్న కె.వి.రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రిలో 1912 వ సంవత్సరం జూలై 1 న జన్మించారు. కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలలో కథానాయకులకే కాకుండా ఇతర చిన్న పాత్రలకు సైతం ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.
ఉదాహరణకు సత్య హరిశ్చంద్ర చిత్రంలోరేలంగి, జగదేకవీరుని కథ చిత్రంలో రాజనాల, మాయాబజార్ చిత్రంలో ఎస్వీ.రంగారావుపాత్రలు. అంతేకాక కె.వి.రెడ్డి సినిమాలలో గిల్పం, తసమదీయులు, పరవేశ దవారం, డింభకలాంటి కొత్త పదాలు వినిపించడం కద్దు. ఈయన సినిమాలలో కథ, చిత్రానువాదం, పాత్రల విశిష్టతే కాకుండా సంగీతం కూడా ఎంతో బాగుంటుంది.
చలనచిత్రాలను అపురూపంగా,అద్వితీయంగా,అద్భుతంగా, రసప్లావితంగా,ప్రేక్షకజన సమ్మోహితంగా రూపొందించిన ఈ దర్శక మహేంద్రుడు కె.వి.రెడ్డి గారు 1972 సెప్టెంబరు 15 న కీర్తిశేషులైనారు
.

VANI JAIRAM



बोले रे पपीहरा
नित मन तरसे, नित मन प्यासा 
नित मन तरसे, नित मन प्यासा
बोले रे पपीहरा...
पलकों पर इक बूँद सजाए
बैठी हूँ सावन ले जाए
जाए पी के देस में बरसे
नित मन प्यासा, नित मन तरसे
बोले रे पपीहरा...
सावन जो संदेसा लाए
मेरी आँख से मोती आए
जान मिले बाबुल के घर से
नित मन प्यासा, नित मन तरसे
बोले रे पपीहरा...
Singer Vani Jairam gained overnight popularity for singing this classical song in Guddi (1971) composed by Vasant Desai.
https://youtu.be/ESdnrnXLgOA
~ Thanks to my literary friend Namrata Saluja ~

RAJSHREE



# RAJSHREE - She can show the charm and grace of stones too
************************************************************************* 
Rajshree, the star daughter of acclaimed filmmaker V. Shantaram and actress Jayshree , was one of the top stars of 1960s in Hindi cinema. She was known for her classic beauty, acting and dancing capabilities.
Rajshree launched her career as a child star in her father V.Shantaram's Subah Ka Taara (1954). V.Shantaram launched her as heroine opposite Jeetendra in the film Geet Gaya Patharon Ne in the year 1964. Rajshree acted in numerous hit films including Geet Gaaya Pattharon Ne (1964), Janwar (1965), Brahmachari (1968), Around the World (1967) and was a lead actress opposite Raj Kapoor, Shammi Kapoor, Biswajit, Manoj Kumar, Jeetendra, to name few. Her other notable films include Stree (1961), Ghar Basake Dekho (1963), Shehnai (1964), Ji Chahta Hai (1964), Do Dil (1965), Mohabbat Zindagi Hai (1966), Sagaai (1966) , Gunahon Ka Devta (1967), Dil Ne Pukara (1967), Suhaag Raat (1968) and Naina (1973).
Rajshree left a lucrative career and settled in Los Angeles after marrying American Greg Chapman in 1967. The couple have a daughter.
~ Credits to my literary friend Namrata Saluja ~

DECENCY

DECENCY
"Talk to me with decency so that I can answer you with decency" 
~ Shabana Azmi ~

" A white flower grows in the quietness.Let your thought become that flower" ~ Sree Rama Samartha ~

WHITE FLOWER


" A white flower grows in the quietness.Let your thought become that flower"
~ Sree Rama Samartha ~

Make up

And some creatures are not in need of make up
~ Poetess Aziza Dahdouh ~

LEAVE EGO

LEAVE EGO
“When you scale a mountain, you have to leave your ego at home.” 
~ Sri Rama Samartha ~

POET



POET 
"Poets are nothing but mystics.They have been mysteriously silent"
~ Sri Rama Samartha ~

Maaredu Dalaalu (Bilva leaves

Maaredu Dalaalu (Bilva leaves) is a deep study of the life of the great philosopher Sri Adi Sankaracharya. This is a unique publication that first appeared in as a weekly column for 54 weeks in 'Srisaila Prabha' monthly magazine. Listeners will get a true understanding of the Advaita Philosophy, not found anywhere else.
దాసుభాషితం శ్రోతలందరికీ నమస్కారం
‘మారేడు దళాలు’
భారత దేశం పుణ్యభూమి. మహోన్నతమైన ఆధ్యాత్మిక సత్యాలను అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఎందరో మహర్షులకు జన్మభూమి. వారందరూ విశ్వమానవ సౌఖ్యం కోసం మానవుడి పరమోన్నతి కోసం నిరంతరమూ తపించారు, అపారమైన జ్ఞానాన్ని పొందారు, ప్రబోధించారు. నిజానికి తత్త్వ జ్ఞానం సామాన్యుడికి బహు దూరం. అంతటి దుర్లభమైన జ్ఞానాన్ని తపోఫలంగా పొందిన సూత, శుక, శౌనకాదుల వంటి ఎందఱో ఋషులు, ఆ జ్ఞానాన్ని తమ కోసమే కాకుండా ఈ ధర్మ ధరిత్రి మీద అతి సామాన్యులకు సయితం అందేలా సహస్రాబ్దాలుగా నిరంతరం ప్రవహింప జేస్తూనే ఉన్నారు. ఈ కోవకు చెందిన మహనీయులలో ప్రథములు, ప్రముఖులు, అద్వైత జ్ఞానామృతాన్ని ఆసేతు హిమాచలం పరివ్యాప్తం చేసిన శ్రీమద్శంకర భగవద్పాదులు.
ఈ భూమి మీద, శత, సహస్రాబ్దాలుగా జ్ఞాన సముపార్జన నిమిత్తం అన్ని కాలాల్లోనూ అనేక అన్వేషణలు కొనసాగాయి. ఇవన్నీ సత్యాన్ని కథన రూపంలో దర్శించే, దర్శింపజేసే ప్రయత్నమే చేశాయి. ఈ అన్వేషణలు, చాలా వరకూ వేదాలూ ఉపనిషత్తులూ కేంద్రంగా కాగా, మరి కొన్ని, వాటికి అతీతం గానూ, వ్యతిరేకంగానూ సాగాయి. ముఖ్యంగా బౌద్ధ, జైన దర్శనాలు. ఈ అన్వేషణలోని భాగాలే అయినప్పటికీ. అవి ధర్మం గురించీ సంఘం గురించీ మాత్రమే చెప్పాయి కానీ దేవుడిని గుర్తించ లేదు. తదనుగుణంగా కొన్ని వందల సంవత్సరాల పాటు మహారాజులు, చక్రవర్తుల ప్రత్యక్ష ఆశ్రయం, పోషణ, ప్రాపకాలతో ఉధృతంగా జరిగిన ప్రచారం కారణంగా, ఆయా విశ్వాసాలను పాటించే వారిలో సైతం భయభక్తులు లోపించి విచ్చలవిడితనం. భోగలాలసత్వం ప్రబలి, నైతిక విలువలు నశించి, సాత్త్విక చింతనకు, శ్రేయస్కర జీవనానికి దూరమై పూర్తిగా భ్రష్టు పట్టిన సమాజం పతనావస్థకు చేరుకుంది.మరోవైపు సనాతన ధర్మం ఆచరిస్తూ సన్మార్గంలో జీవించేవారు అవహేళనలకూ, అవమానాలకూ, సామూహిక హింసకూ గురయ్యారు.. నిజానికీ బౌద్ధం కానీ, జైనం కానీ ఈ విధమైన కృత్యాలను ప్రబోదించలేదు, ప్రోత్సహించనూ లేదు. ఏదో విధంగా తమ మతం వ్యాప్తి చెండుతున్నది కదా అనే సంకుచిత దృష్టితో, సమాజాన్ని సన్మార్గంలో పెట్టవలసిన వారు గానీ ఆ ప్రయత్నం చేసిన వారు గానీ, దురదృష్టవశాత్తూ, ఆ మతాలలో లేకపోయారు. తత్ఫలితంగా అప్పటికే ప్రపంచం నలుమూలలా విస్తరించిన వైదిక జ్ఞాన జ్యోతులు కొడిగట్టి ప్రభావం కోల్పోయాయి. అసలు సనాతన ధర్మమే నామమాత్రావశిష్టమూ, ప్రశ్నార్దకమూ అయి పెను ప్రమాదంలో చిక్కుకున్నది.
అటువంటి విపత్కర సమయంలో -- కూర్మ పురాణంలో చెప్పబడినట్లు -
దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే |
స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః |
కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః |
శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా||
“దుష్టాచారాన్ని నశింపజేసి, శ్రౌత, స్మార్త క్రియలను సుప్రతిష్టితం చేసి, వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టటానికి నీల లోహితుడైన శివుడే స్వయంగా శ్రీ శంకర భగవత్పాదులుగా అవతరించారు.” ఆ విధంగా కారణ జన్ములైన శంకరులు అద్వైత మత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి తద్వారా వైదిక ధర్మాన్ని పునరుద్ధరించారు. అలాగే భవిష్యత్తులో వైదిక ధర్మానికి మళ్ళీ ఎటువంటి ప్రమాదం ఏర్పడకుండా, సనాతన ధర్మ పరిరక్షణ. ప్రచారమూ, ఆచరణా శాశ్వతంగా జరిగే విధంగా దేశం లోని నాలుగు దిక్కులా నాలుగు పీఠాల రూపంలో పటిష్టమైన ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఆదిశంకరులు కేవలం ఎవరో ఒక సర్వసంగ పరిత్యాగి, ఒక సన్న్యాసీ కాదు. వారు ఒక దివ్య చైతన్య మూర్తి. గొప్ప తాత్వికుడు, విశిష్ట కవి, మహా పండితుడు, మహాయోగి, సమాజ సంస్కర్త, ఉద్దారకుడు, తిరుగులేని వక్త, మానవతా విలువలకు కట్టుబడిన ఉదార హృదయుడు, అమోఘమైన వ్యూహ కర్త – ఇలా, పరిశీలకులకు వారిలో ఎన్నో కోణాలు గోచరిస్తాయి.
అంతటి మహాద్భుతమైన శ్రీ శంకరాచార్యుల వారి జీవితాన్ని లోతుగా అధ్యయనం చేసి, అన్ని కోణాలనూ స్పృశిస్తూ, సమగ్రమైన వివరణలతో, శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్ల దేవస్థానం కొంత కాలం క్రితం తమ మాస పత్రిక ‘శ్రీశైలప్రభ’ లో ‘మారేడు దళాలు’ పేరున సరళమైన తెలుగులో దారావాహినిగా ప్రచురించింది ఆ ధారావాహినిని, ఇప్పుడు మీకు శ్రవణ రూపంలో అందిస్తున్నది దాసుభాషితం. శ్రవణానువాదం, గళం : కొండూరు తులసీదాస్. వినండి ‘మారేడు దళాలు’ – శ్రవణ పుస్తకం నిడివి 09:48:33
https://www.dasubhashitam.com/ab-title/ab-maaredu-dalaalu#
~ Credits to Sri Tulasidas Konduru and Sri Sailadevasthanam ~

#వృధ్ధోప సేవ *



#వృధ్ధోప సేవ
*************
కోడలైనా, కొడుకైనా తల్లితండ్రులను, అత్తమామలను నిత్యం ఆదరించాల్సిందే!!!
పోషించాల్సిందే....
దాన్నే వృధ్ధోప సేవ అంటారు!!!

Telugu Velugu Mangarani lessons on you tube *




Telugu Velugu Mangarani lessons on you tube 
******************************************************
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, రాజమహేంద్రవరంలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న శ్రీమతి మంగా రాణి యూ ట్యూబ్ లో సాధిన అరుదైన ఘనత ఇది!!! ప్రాథమిక స్థాయి చిన్నారులకోసం ఆవిడ అందిస్తున్న వీడియో పాఠాలు చూస్తున్న వీక్షకుల సంఖ్య ఒక కోటి దాటింది....అభినందనలు మంగా రాణి గారు....సమాజానికి మీ వంటి ఉపాధ్యాయుల అవసరం నేడు ఎంతైనా ఉంది... 
మంగా రాణి గారి వీడియో పాఠాలు ఈ క్రింది లింక్ ద్వారా యూ ట్యూబ్ లో తిలకించవచ్చు!!
www.youtube.com/Mangarani

THANUJA

THANUJA
Birthday Greetings to beautiful yesteryear actress Tanuja , who turned 75 years today.
Tanuja Mukherjee (born Tanuja Samarth; 23 September 1943), popularly known as Tanuja, is an Indian film actress, who predominantly works in the Hindi film industry. Part of the Mukherjee-Samarth family, she is the daughter of Shobana and Kumarsen, and was married to Shomu Mukherjee, with whom she has two daughters, actresses, Kajol and Tanisha. A recipient of two Filmfare Awards, Tanuja is best known for her roles in the Hindi films, Baharen Phir Bhi Aayengi (1966), Jewel Thief (1967), Haathi Mere Saathi (1971), Anubhav (1971) and Mere Jeevan Saathi (1972)
She started her film career with her older sister Nutan in Hamari Beti (1950) as Baby Tanuja. As an adult, she debuted in the film Chhabili (1960) which was directed by her mother and had her sister, Nutan, in the lead. The film that truly marked her transition into adult heroine came with Hamari Yaad Aayegi (1961), directed by Kidar Sharma, who had earlier discovered Raj Kapoor, Madhubala and Geeta Bali.
One of her early films, noticeable for her acting, was Baharen Phir Bhi Aayengi (1966), directed by Shaheed Latif. Incidentally it was Guru Dutt team's last offering, especially visible in the song, "Woh Hanske Mile Humse" (believed to have been picturized while Guru Dutt was still alive) who worked hard to help her "tone down" her performance. The result was that the natural, spontaneous performer gave a highly restrained performance which became the highlight of the film — as well of her career — as she moved to lead roles soon after. Tanuja had an important supporting role in the hit film, Jewel Thief. Her next big film was with Jeetendra, Jeene Ki Raah (1969), an immediate and surprise hit. In the same year, Tanuja won the Best Supporting Actress at Filmfare for Paisa Ya Pyar. After the success of Haathi Mere Saathi (1971), she acted in Door Ka Raahi, Mere jeevan Saathi, Do Chor and Ek Baar Muskara Do (1972), Kaam Chor, Yaarana, Khuddar, and Masoom. Some of the other films she has acted in are Pavitra Paapi, Bhoot Bangla, and Anubhav. Some of her Marathi films are 'Zaakol', 'Unad Maina' and Pitruroon
~ Credits to my literary friend Namrata Saluja ~

SUCH A PURE INNOCENCE



SUCH A PURE INNOCENCE 
when innocent joy appears
our own resonance comes through
we are renewed through the play
back in true touch
with pure happiness
child like twinkles of love's dance
apparent in the sweet eyes
wisdom's way
(c) Janet Rice Carnahan 2018