Wednesday 2 January 2019

ఓ భారతీ నిజం తెలుసుకో!!!

ఓ భారతీ నిజం తెలుసుకో!!!
ఇద్దరు మహిళలు

పుణ్యభూమి కేరళలో
వందలకొద్దీ పోలీసు బలగాలతో
మరో ఎవరెస్టును
అధిరోహించినంత సంబరపడ్డాయి!!!
దదామిబుద్ధి మోగం తం యేన మా ముపయానిత్తే
అని గీత చెబుతుంది..
అనగా  ఆయా పుణ్యక్షేత్రాలకు ఉన్న స్థల ప్రాశస్త్యం , ఆచారాన్ని బట్టి
 నిర్మలమైన ,ప్రశాంతతో కూడిన భక్తి మార్గం ద్వారా వెళితే జ్ఞానం ప్రాప్తిస్తుందనీ, తద్వారా మనిషి మోక్షాన్ని సాధించ వచ్చని గీత చెబుతుంది!!!
అయితే మాకేమిటి అన్న ఆ మహిళలు
కాలం చెల్లిన కోర్టులు
వంత పాడే నీతి లేని ఫెమినిస్టులు
అసభ్యత,అశ్లీలతే పెట్టుబడిగా చలామణి అవుతున్న
చానల్లు, సినెమాలు
ప్రతి జీవికి జీవించే హక్కు ఉంటుంది
అయినా మాకేంటి వాటినే మేము రోజూ కాల్చుక తింటాము
అంటూ దురూప దేశాలు చేస్తున్న బృందాలు, కారత్ లు
మూగపోయిన కలాలు, గళాలు!!!!!!
అతల,సుతల,తలాతల,రసాతల,భూతల మనెడి
పదునాలుగు లోకాల్లో మనిషీ నీ ఉనికెంత???
రాక రాక వచ్చిన మానవ జన్మను కోల్పోవటం తప్ప!!!
భారతీ...

అందరికీ అమ్మవు....ఇక నైనా మేలుకో!!
నిర్మలమైన భక్తి తోనే జ్ఞానం...జ్ఞానం తోనే ముక్తి!!!
భారతీ....
అందరికీ అమ్మవు నీవు .. ఇక నైనా మేలుకో!!
ధర్మాన్ని తెలుసుకో!!!













No comments:

Post a Comment