Thursday, 5 November 2020

శ్రీ గురు చరిత్ర....🙏🏻 అధ్యాయం 3&4... గుప్త భావం

 దత్త లీలా క్షేత్ర మహత్యం

శ్రీ గురు చరిత్ర....🙏🏻

అధ్యాయం 3&4...

గుప్త భావం

3&4అధ్యాయాలు మనకు ఏమి చెపుతున్నాయి?

రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.

మనలో భగవంతుని చేరాలి (మన నిజ స్వరూపం తెలుసుకోవాలి )అనే  జిజ్ఞాస  ఇప్పుడే పెరిగింది అంటే గురువు యొక్క  అనుగ్రహం ప్రారంభం అయినట్లు. మీరు మీ గురువుని ఎలా సేవించి అనుగ్రహం పొందారు? అని మన గురువును అడిగి తెలుసుకోవచ్చు.


నేను నాకు దొరికిన  సద్గురువును ఎలా శ్రద్ధగా, భక్తితో సేవించాలి? గురు లీలలు గమనించడం, గురువు గురించి, వారి భోధనలు శ్రద్ధగా వినడం కూడా అమృత సేవనంతో సమానమే.  మన  గురువు మనలను కూడా కొన్ని మిషలతో అంటే లోకిక కోరికలు తీరుస్తూ ఆధ్యాత్మిక వైపుకు నెడుతూ గురు భోధల  ఆచరణ వైపుకు కూడా నెడతారు.


 అసలు విశ్వ గురువు అయిన దత్తుడు ఎందుకు, ఎలా వెలిశారు అని తెలియజేస్తుంది ఈ అధ్యాయం. మరల, మరల ఎందుకు జన్మిస్తున్నారు?అత్రి,అనసూయలు ఎలా దత్తుడిని దత్తం చేసుకున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.

వారు దుర్వాస మహర్షి శాపం వలన భూమి మీద మరల మరల జన్మించడం  మనకు వరం. వారి ప్రతిజ్ఞ మనకు సంతోషం. వారి ప్రతిజ్ఞ ఏమిటి?

ప్రపంచంలోని చివరి జీవిని కూడా  తరిపజేసి, మోక్షం ఇవ్వడం తన ప్రతిజ్ఞ.

జై గురు దత్త🙏🏻

గురుచరిత్ర గుప్త భావం... అధ్యాయం-5..🙏🏻

 దత్తలీలా క్షేత్ర మహత్యం....

గురుచరిత్ర 

గుప్త భావం...

అధ్యాయం-5..🙏🏻

ఏమి చెపుతోంది.

రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.

ఏమి తెలియని స్థితిలో మనము సత్యాన్వేషణ కు బయలు దేరగా ఆవు దూడను విడిచి ఉండలేనట్లు పరుగున సద్గురువు రూపంలో ఆ భగవంతుడు పరుగున తన బిడ్డ దగ్గరకు వచ్చారు.వచ్చి తన బిడ్డకు ఉపదేశిస్తూనే సంస్కరించు చున్నారు.

మనలో తెలియకుండా నే గురు సమక్షంలో అంతర్గత ప్రక్షాళన మొదలు అయింది.అదే గురు సమక్ష మహిమ.ఇప్పుడు 

మాములు మానవ శరీరంతో వచ్చిన గురువును గుర్తించి సేవించడం ఎలా?ధర్మ రూపుడై ,సత్య స్వరూపుడు అయిన గురువు మానవులకు ఎలా వరాలు ఇస్తారు? పవిత్రమైన గర్భంలో ఎలా జన్మించారు? లోక కళ్యాణానికి కారణమైన కోరికలకు భగవత్ కృప, ఆశీస్సులు ఎలా లభిస్తాయి? లౌకిక భంధాలలో చిక్కుకున్న వారికి తన భోధతో శాశ్వతమైనస్థితి ఏమిటో తెలియజెప్పడం,భక్తుల మాయా, మొహాలు పటాపంచలు చేయడం ఇలాంటి విషయాలు తెలుపుతుంది.

శ్రీ గురు చరిత్ర....🙏🏻 అధ్యాయం 3&4... గుప్త భావం

 దత్త లీలా క్షేత్ర మహత్యం

శ్రీ గురు చరిత్ర....🙏🏻

అధ్యాయం 3&4...

గుప్త భావం

3&4అధ్యాయాలు మనకు ఏమి చెపుతున్నాయి?

రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.

మనలో భగవంతుని చేరాలి (మన నిజ స్వరూపం తెలుసుకోవాలి )అనే  జిజ్ఞాస  ఇప్పుడే పెరిగింది అంటే గురువు యొక్క  అనుగ్రహం ప్రారంభం అయినట్లు. మీరు మీ గురువుని ఎలా సేవించి అనుగ్రహం పొందారు? అని మన గురువును అడిగి తెలుసుకోవచ్చు.


నేను నాకు దొరికిన  సద్గురువును ఎలా శ్రద్ధగా, భక్తితో సేవించాలి? గురు లీలలు గమనించడం, గురువు గురించి, వారి భోధనలు శ్రద్ధగా వినడం కూడా అమృత సేవనంతో సమానమే.  మన  గురువు మనలను కూడా కొన్ని మిషలతో అంటే లోకిక కోరికలు తీరుస్తూ ఆధ్యాత్మిక వైపుకు నెడుతూ గురు భోధల  ఆచరణ వైపుకు కూడా నెడతారు.


 అసలు విశ్వ గురువు అయిన దత్తుడు ఎందుకు, ఎలా వెలిశారు అని తెలియజేస్తుంది ఈ అధ్యాయం. మరల, మరల ఎందుకు జన్మిస్తున్నారు?అత్రి,అనసూయలు ఎలా దత్తుడిని దత్తం చేసుకున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.

వారు దుర్వాస మహర్షి శాపం వలన భూమి మీద మరల మరల జన్మించడం  మనకు వరం. వారి ప్రతిజ్ఞ మనకు సంతోషం. వారి ప్రతిజ్ఞ ఏమిటి?

ప్రపంచంలోని చివరి జీవిని కూడా  తరిపజేసి, మోక్షం ఇవ్వడం తన ప్రతిజ్ఞ.

జై గురు దత్త🙏🏻

భజన::- 🙏🏻🌷🙏🏻

 భజన::- 🙏🏻🌷🙏🏻

॥పార్వతీచ్యా నందనా గణపతి మౌరయా గజాననా ॥

॥పశుపతిచ్యా నందనా మూషకవాహన గజాననా ॥

॥కశ్యపముని నందనా విఘ్నచ్చేదనా భయహరణా॥

॥అదితిసతీ నందనా అసురనాశనా సుఖసదనా॥

॥భక్తజనాహ్లాదనా గణపతి మౌరయా గజాననా ॥

పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి వారు  రచించిన గణపతి భజన

ఆరోగ్య సూత్రాలు:-

ఆరోగ్య సూత్రాలు:-
@ నిలబడి నీళ్ళు త్రాగే వారికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి నిలబడి నీళ్ళు త్రాగే వారి మోకాళ్ళ నొప్పిని ప్రపంచంలో ఏ డాక్టర్ బాగు చేయలేడు. కాబట్టి కూర్చుని త్రాగండి
🅱️ ➕ 
వేగంగా తిరిగే ఫ్యాన్ గాలి క్రింద లేదా A. C.లో పడుకుంటే శరీరం పెరిగి లావై పోతారు.
🅱️ ➕ 
*70% నొప్పులకు ఒక గ్లాసు వేడి నీళ్ళు చేసే మేలు ఏ పేన్ కిల్లర్ కూడా అంతగా చేయదు.
🅱️ ➕ 
*కుక్కర్లో పప్పు మెదుగు తుంది, ఉడకదు. అందుకే గ్యాస్ మరియు ఎసిడిటీ వస్తుంది.
🅱️ ➕ 
*అల్యుమినియం పాత్రల ప్రయోగం బ్రిటీష్ వాళ్ళు భారతీయ దేశభక్తులైన ఖైదీలు అనారోగ్యం చేయటానికి చేసేవారు.
🅱️ ➕ 
*షర్బతు మరియు కొబ్బరి నీళ్ళు ఉదయం 11 గం. లోపు అమృతం వలె పనిచేస్తాయి.అ
🅱️ ➕ 
పక్షవాతం వచ్చిన వెంటనే రోగి ముక్కు👃లో దేశవాళి ఆవు నెయ్యి వేస్తే 15 నిమిషాల్లో బాగా అవుతారు
🅱️➕ 
*దేశవాళి ఆవు శరీరం పైన చేతి✋ తో నిమిరితే 10 రోజుల్లో బ్లడ్ ప్రెషర్ నయమౌ తుంది. పక్షవాతం రాదు.
🅱️➕ 
మంచి మాటలు, మంచివారికి, తమ ఇష్ట మిత్రులకు, బంధువులకు మరియు గ్రూపులో తప్పక షేర్ చేయండి. ఈ విధంగా నైనా మనం ఒకరి జీవితం రక్షించిన వారిమి అవుతాం

Tuesday, 3 November 2020

దత్తావతారము

 బ్రహ్మ విష్ణు మహేశ్వర సమైక్య రూపమే దత్తావతారము .అది త్రిమూర్తుల సమానిత్వం .

వారి వరప్రభావము వల్ల అత్రి అనసూయల దంపతులకు దత్తుడు జన్మించాడు .దత్తం అంటే
ఇవ్వడం .అత్రికుమారుడు కాబట్టి ఆయనను
"ఆత్రేయుడు "అని పిలుస్తారు .దత్తాత్రేయుడు
తపస్సు చేసి పరిపూర్ణ జ్ఞానార్జన చెసాడు .ఇరవై
నలుగుర్ని తన గురువులుగా భావించాడు .
కార్త్యవీరుడు ,పరశురాముడు ,యదువు ,అలర్కుడు ,ప్రహ్లాదుడు వంటి అనేకమందికి అధ్యాత్మిక
విద్యను బోధించాడు .అవధూత గీత ,జీవన ముక్త
గీత ,అవధూతోపనిషత్ అని గ్రంథాలు రచించాడు .దత్తుడు మహత్ముడు .ఆయనే అది గురువైన పరబ్రహ్మము .శిష్యకోటి హృదయాలలో
అఖండ జ్ఞానదీపము వెలిగించిన వైరాగ్యరూప
విలక్షణ మూర్తి .ఆయన చుట్టూ ఉన్న నాలుగు
ప్రాణులే నాలుగు వేదాలు .అహంకారాన్ని దండించడానికే దండము ధరించానని ,జోలె పట్టింది భక్తుల సంచిత కర్మల కోసమేనని
ప్రవచించాడు .దత్తాత్రేయ బోధలు లోక కల్యాణ
కారకాలు .భూమి నుంచి సహనశీలత ,గాలి నుండి స్వేచ్ఛ ,ఆకాశమునుండి నిస్సంగత్వం
స్వీకరించాలని ఉద్బోధించారు .అగ్ని నుండి
నిర్మలత్వాన్ని ,సముద్రజలం నుండి గాంభీర్యాన్ని
కపోతం నుండి నిర్మోహత్వాన్ని గ్రహించాలన్నారు
అప్రయత్నంగా వచ్చే అహారాన్ని మాత్రమే
మానవులు స్వీకరించాలి .కొండచిలువలాగా
భ్రాంతి వలలో పడకూడదు .స్పర్శానందానికి
దూరముగా ఉండటం ఏమిటో మిడతను చూసి
తెలుసుకోవాలి .ఏనుగు నుంచి పట్టుదల ,చేప నుంచి త్యాగచింతన అలవర్చుకోవాలి .చీమలా
జిహ్వచాపల్యానికి లోను కారాదు .అప్పుడే
సుఖానికి మూలము అవగతమవుతుందని
దత్తాత్రేయుడు ప్రబోధించాడు .

శ్రీ దత్తస్తవము.

ఎవరైతే శ్రీ దత్తాత్రేయుని భక్తితో స్మరిస్తారో వారి సమస్త పాపములు నశిస్తాయి. దీనిలో సందేహం లేదని
దత్త హృదయం నందు చెప్పబడియుంది ...
దత్త దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః !
తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయం !!
శ్రీ దత్తాత్రేయుడు కేవలం స్మరణకు మాత్రం సంతుష్టుడు తీవ్రమైన పూజాదికాలు చేయకపోయిన
" అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ "
అనే పవిత్ర భావనతో , భక్తితో దత్త దత్త అని స్మరిస్తే చాలు ఏదో ఒక రూపంలో వచ్చి , రక్షించి కోరిన కోరికలు తీర్చు దయామయుడు శ్రీ దత్తాత్రేయుడు ..
శ్రీ భాగవత గ్రంథము నందు ప్రథమ స్కంధ తృతీయాధ్యాయములో భగవంతుని 21 అవతారములలో 6 వ అవతారం దత్తాత్రేయుని అవతారమని చెప్పబడినది...
స్వామి స్మరణ రోగాలను పటాపంచలు చేస్తుంది .... భూత , ప్రేత , పిశాచ , గ్రహ బాధలను దూరం చేస్తుంది .... పీడకలలు దరిరావు ....
సర్ప , వృశ్చికాది జనిత విషబాధలు , కుష్టు మొదలైన వ్యాధులు నశిస్తాయి ....
త్రికరణ శుద్ధి కలుగుతుంది ....
కోరిన కోర్కెలు నేరవేరి జీవితం ధన్యమవుతుంది ...
🌼🌼🌼🌼శ్రీ దత్తస్తవము.🌼🌼🌼🌼
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
ఓం దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్త వత్సలం !
ప్రప్రన్నార్తి హరం వందే స్మర్త్యగామీ సనోవతు !!
దీనబంధు కృపాసింధుం సర్వకారణ కారణం !
సర్వరక్షాకరం వందే స్మర్త్యగామీ సనోవతు !!
శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణం !
నారాయణ విభుం వందే స్మర్త్యగామీ సనోవతు !!
సర్వానర్థ హరం దేవం సర్వ మంగళ మంగళం !
సర్వ క్లేశ హరం వందే స్మర్త్యగామీ సనోవతు !!
బ్రహ్మణ్యం ధర్మ తత్త్వజ్ఞం భక్తి కీర్తి వివర్థనం !
భక్తభీష్ట ప్రదం వందే స్మర్త్యగామీ సనోవతు !!
శోషణం పాప పంకస్య దీపను జ్ఞాన తేజసః !
తాప ప్రశమనం వందే స్మర్త్యగామీ సనోవతు !!
సర్వరోగ ప్రశమనం సర్వ పీఢా నివారణం !
ఆపరుద్ధరణం వందే స్మర్త్యగామీ సనోవతు !!
జన్మ సంసార బంధఘ్నం సర్వరూపానంద దాయకం !
నిశ్శ్రయస పదం వందే స్మర్త్యగామీ సనోవతు !!
జయ లాభ యశః కామ దాతుర్దత్తస్య యత్ స్తవం !
భోగ మోక్ష ప్రదస్యేమం ప్రపఠేత్ యసుకృతీ భవేత్ !!
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺