Tuesday 7 May 2019

పంచేంద్రియాలు

సాహిత్య రచనలయినా, సామాజిక మాధ్యమం లోని పోస్టులు అయినా, నాలుగు మంచిమాటలైనా ప్రజాభిరుచులను అనుసరించే ప్రసిధ్ధం కావాలి.మనము పలువురితో చెప్పగలిగే మాటల్లో ధర్మము,సమాజ రీతి,నీతి,ప్రజా వ్యవహారము, అభిలాష, ప్రవృత్తులు మొదలైన అనేక అంశాలను సుష్పష్టంగా ప్రతిబింబించాలి!!ఈ నిబధ్ధత కలిగి ఉండటం వల్లే నేను విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు శ్రీ తాడికొండ వెంకట నరసింహా రావు
గారి పోస్టులను అనుసరిస్తూ ఉంటాను --
వారి టైంలైన్ నుంచి సేకరించిన ఒక అమూల్యమైన పోస్ట్ మీ అందరికోసం:
***************************
* * * పంచేంద్రియాలు * * *
మనకు దైవానుగ్రహంతో లభించిన
పంచేంద్రియాలను సక్రమంగా వినియోగించుకోవాలి.
మంచి దృశ్యాల్ని చూడాలి,
ధార్మికమైనవాటినే వినాలి,
సువాసనలనే పీల్చగలగాలి,
సంతోషాలనిచ్చే మాటల్ని పలకాలి,
అంతేకాదు సాత్వికాహారాన్ని తీసుకోవాలి,
నిరభ్యంతరమైన స్పర్శనే కోరుకోవాలి, పొందాలి.
వేద విహిత ధర్మాచరణతో కృతకృత్యులమౌదాం,
ఆదర్శవంతులమౌదాం.
***************************

No comments:

Post a Comment