Sunday 3 June 2018

సాపేక్ష ప్రతిభా గ్రేడింగు….. [భారతీయత మీద విద్యారంగం ద్వారా కుట్ర ]

సాపేక్ష ప్రతిభా గ్రేడింగు….. [భారతీయత మీద విద్యారంగం ద్వారా కుట్ర ]
*****************************************************************
సాపేక్ష ప్రతిభను [relative performance] అనుసరించి గ్రేడింగు ఇస్తారట! ప్రైవేటు విద్యాసంస్థల్లో అనారోగ్యకర పోటీని నివారించి, విద్యార్ధుల మీద ఒత్తిడిని తగ్గించేందుకు ఈ పద్దతి అనుసరిస్తారట. నిజానికి ఇప్పటికి ఉన్న విధానంలో తొలి 10 ర్యాంకులే ప్రకటిస్తారు. దాని కోసమే ప్రైవేటు చిన్న విద్యాసంస్థలూ, కార్పోరేటు విద్యాసంస్థలూ పోటీ పడతాయి; లాబీయింగు చేస్తాయి. గుత్తగా ర్యాంకుల్నీ, మార్కుల్నీ కొంటాయి. మిగిలిన విద్యార్ధుల పరిస్థితి, ఈ ర్యాంకర్ల పరిస్థితితో పోల్చుకుంటే కొంత ప్రశాంతమే, ఒత్తిడికి తగినంత దూరమే. [చూశారా కొత్త విధానం చూపి, పాత విధానమే మంచిది అని మనచేతే చెప్పిస్తున్నారు. ‘పొయ్యిలో పడటంతో పోల్చుకుంటే పెనం పైన ఉండటమే మేలు అన్నట్లు!’ అదీ కార్పోరేట్ స్ట్రాటజీ !]
అయితే ఈ కొత్త విధానం చూడండి. విద్యార్ధికి తనకి వచ్చిన మార్కులని బట్టి అతడి గ్రేడ్ ఉండదు. ఉదాహరణకి 1000 మంది విద్యార్ధులు పరీక్ష వ్రాసారనుకొండి. అందరి కంటే ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్ధి[ని] కి 600 కి 596 మార్కులు వచ్చాయనుకొండి. ఆ గరిష్ట మార్కు దగ్గరి నుండి తొలి 125 మందికి A1 గ్రేడ్ ఇస్తారట. అప్పడయినా గరిష్టమార్కులు [అంటే మొదటి ర్యాంకు వంటిదే గదా?] పరిగణించినట్లే గదా? ప్రభుత్వం ప్రకటించినా, ప్రకటించకపోయినా, కార్పోరేట్ సంస్థలు, ఏదో విధంగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రకటించుకోకుండా ఉండవు కదా!
అదీగాక 596 మార్కులు ఓ 25 మందికీ, 594 మార్కులు మరో పాతిక మందికీ….. ఇలా వచ్చి ఏ 585 మార్కుల దగ్గరికో వచ్చేసరికి 125 మంది జాబితా పూర్తయ్యిందనుకొండి. ఇంకా 585 మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి A2 గ్రేడ్ ఇస్తారట? మరి వీళ్ళని ఎలా విడదీసి, ఎవరు ముందు, ఎవరు వెనుక, ఎలా లెక్కిస్తారు?
మరింత వివరిస్తాను. 1000 మందిలో మొదటి 12.5% శాతం అంటే 125 మందిని A1 గ్రేడ్ కు ఎంపిక చేయాలి. మొదటి ర్యాంకు మార్కులు 596 వచ్చాయి అనుకుందాం.
596 మార్కులు వచ్చిన వాళ్ళు = 25
594 మార్కులు వచ్చిన వాళ్ళు = 25
592 మార్కులు వచ్చిన వాళ్ళు = 25
590 మార్కులు వచ్చిన వాళ్ళు = 25
మొత్తం 100 అయ్యారు. మిగతా 25 మందిని ఎంపిక చేయాలి?
585 మార్కులు వచ్చిన వాళ్ళు = 50 మంది ఉంటే…. ఏ ప్రాతిపదికన, వీరిలో 25 మందిని ఎంపిక చేస్తారు?
అలాంటప్పుడు అసలు ఏ విద్యార్ధి అయినా తనని తాను ఎలా[asses] లెక్కగట్టుకుంటాడు? తన మార్కులతోబాటు తనకంటే ముందున్న 125+ మంది మార్కుల్నీ పరిశీలించుకోవాల్సిందేనా? ఈ విధంగా విద్యార్ధుల్లో పోటీనీ, ఒత్తిడినీ ఎలా నివారిస్తారు?
Matha Ananthananda ~

No comments:

Post a Comment